Thursday 12 September 2013

నేను చదివిన ఒక అందమైన కవిత .


నీవు తాకి వెళ్ళిన నాటి నుండి
మువ్వలు మూగబోయి సడిచేయడం మానేసాయి
మౌనంగానే వింతశబ్దాలు చేయాలని 
విశ్వప్రయత్నం చేసి అలిసిపోఅయాయి.

నీ తలపులతోనే కొత్తమెరుపులు
సంతరించుకున్నాయి.
తలపై తలంబ్రాల తారకలు
తారాడే క్షణం కోసం తల్లడిల్లుతున్నాయి.

మోహం పెరిగి ముత్యాలపందిరిలో
నీకై నిరీక్షణలు చేస్తున్నాయి.
నీవు అలదే పారిజాతాల పారాణికై
పరుగులు తీస్తున్నాయి.
కాలిమెట్టెలు తొడిగి కొంటెకోరికలకి
కళ్ళెమెప్పుడు విప్పుతావని అల్లరిపెడుతున్నాయి.

కళ్యాణ గంటలెప్పుడు మోగిస్తావని
నా గుండె గుసగుసలకు తోడెప్పుడొస్తావని
తొందరపడుడుతున్నాయి.
నీ వలపుల వెలుగుతో నా మేనికి
వన్నెప్పుడు అద్దుతావని ప్రశ్నిస్తున్నాయి.
                                             ------శ్రీస్వర్ణ

No comments:

Post a Comment