Saturday 14 September 2013

అవివేకానికి దూరంగా ఉండి యదార్థానికి దగ్గరవగలిగినందు వలననే స్థితప్రజ్ఞులవగలరని మనకు అర్థమగును

జరాం మృత్యుం భయం వ్యాధిం యో జానాతి స పండిత:
స్వస్థ స్తిష్ఠే న్నిషేదే ద్వా స్వపేద్వా కేనచి ద్ధసేత్.

భావము:-
అపాయములు, వ్యాధులు, ముసలితనము, చావు, ఇవి ఎవ్వరికిన్నీ తప్పవు. కాని ఇవి తప్పవని ఎవ్వరును గుర్తించినట్లు ప్రవర్తించరు. వీటి అవశ్యంభావిత్వమును గుర్తించి ప్రవర్తించేవాడు పండితుడు. అట్టివానికి మనస్సు ఎప్పుడూ స్వస్థముగానే ఉంటుంది. అతడు సుఖంగా కూర్చుంటాడు. నిద్రిస్తాడు. పరిహాసంగా మాటలడుతాడు


అవివేకానికి దూరంగా ఉండి యదార్థానికి దగ్గరవగలిగినందు వలననే స్థితప్రజ్ఞులవగలరని మనకు అర్థమగును

 చింతా రామ కృష్ణా రావు గారి ఆంద్రామృతం నుండి స్వీకారము .
http://andhraamrutham.blogspot.in/2010/01/76.html#.UjRnKdJHKi4

No comments:

Post a Comment